- Advertisement -
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతామని తాలుకా బ్యార్లహల్లి వద్ద ఓ మినీ బస్సును ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.
చిక్బళ్లపూర్ డీసీ అనిరుధ్ శ్రవణ్,ఎస్పీ సంతోష్ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. చింతామణి నుంచి మురుగుమల్ల వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం.
