- Advertisement -
భూటాన్లో ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ టీమ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు మరణించారు. ప్రమాదంలో మృతిచెందిన వారిలో లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పైలట్ ఉన్నారు. భూటాన్ ఆర్మీకి చెందిన శిక్షణ పైలట్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో భూటాన్లోని యాంగ్ఫుల్లా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.అరుణాల్ ప్రదేశ్లోని ఖిర్ము నుంచి యాంగ్ఫుల్లాకు వెళ్తుండగా చేతక్ హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యిందని అధికారులు తెలిపారు.