Monday, April 29, 2024
- Advertisement -

పార్టీ శ్రేణుల‌కు పిలుపు నిచ్చిన ఎంపీ మిథున్‌రెడ్డి…

- Advertisement -
2019 Andhra Pradesh cm is YS Jagan says MP Mithun Reddy

2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి వైసీపీ శ్రేణులు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి.జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్నా రాష్ట్రంలో మాత్రం పార్టీ ప్లీన‌రి స‌మావేశాలు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నాయి.ఈస‌మావేశాల‌లో ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంతోపాటు..ఎన్నిక‌లు సిద్దంగా ఉండాల‌ని పార్టీ శ్రేణుల‌ను సిద్దం చేస్తున్నారు.

సమన్వయకర్త డాక్టర్‌ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం ఏర్పాటయింది. దీనికి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకర్‌ నారాయణ, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ ఎల్‌ఎం మోహన్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంత‌పురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశం జరిగింది.

{loadmodule mod_custom,GA1}

అమరావతి పేరుతో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. చిన్నపాటి వర్షానికే అసెంబ్లీలో లీకులు బాబు అవినీతికి నిదర్శనం అని చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం నాణ్యతా రహితంగా నిర్మించారని ఆరోపించారు. నవ నిర్మాణ దీక్షల పేరుతో బాబు మరో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను సీఎం చేయ‌డానికి కార్య‌క‌ర్త‌లంద‌రూ సిద్దంగా ఉండాల‌ని ఎంపీ మిథున్‌రెడ్డి పిలుపు నిచ్చారు.

{loadmodule mod_custom,GA2}

బాబు న‌వ‌ నిర్మాణ దీక్షల పేరుతో బాబు మరో మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే అవినీతి రహిత పాలన, ఆదర్శ పాలన చూడాలంటే వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకై పార్టీ కార్యకర్తలంతా కూడా సిద్ధంగా ఉండాలని చెప్పారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -