- Advertisement -
దేశంలో కరోనాపై పోరాటానికి వ్యాక్సిన్ ఉద్యమం ప్రారంభమైంది. ఆక్స్ఫర్డ్ ‘కొవిషీల్డ్’ టీకాను ఉత్పత్తి చేస్తోన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం 56.5లక్షల టీకా డోసులను వివిధ రాష్ట్రాలకు పంపనున్నట్టు పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. పుణె కేంద్రంగా.. 13 నగరాలకు ఈ వ్యాక్సిన్ సరఫరా కానుందని ట్విట్టర్ వేదికగా ఆయన వెల్లడించారు.
దేశ వ్యాప్తంగా ఈ నెల 16న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం కానుండగా.. తొలివిడతలో భాగంగా పుణె నుంచి ఢిల్లీకి కొవిషీల్డ్ టీకాను పంపినట్టు తెలిపారు అధికారులు. ఈ మేరకు స్పైస్జెట్ ద్వారా.. మొత్తం 34 పెట్టేల్లో 1,088 కిలోగ్రాముల వ్యాక్సిన్ను.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సరఫరా చేశామని పేర్కొన్నారు.