మెక్సికోలోని సిరియా ప్రాంతంలోకి అర్ధరాత్రి జరిగిన గ్యాంగు ఘర్షణల్లో 9మంది మరణించారు. ఈ దాడుల వెనుక ఎవరున్నారనేది తెలియదని పోలీసులు వెల్లడించారు.రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఈ మరణాలు సంభవించి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్క ముఠా ఈ ఘర్షణలకు బాధ్యత వహించకపోవటం గమనార్హం. సంఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను, భీతావహ దృశ్యాలను స్థానిక మీడియా వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ దాడుల వెనుక పైపులైన్ల నుంచి ఇంధనాన్ని దొంగిలించే శాంటా రోసా ముఠా ఉండవచ్చని భావిస్తున్నారు. గత రెండేళ్లుగా రైళ్లు, పైప్లైన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినందున.. ముఠా దోపిడీ, కిడ్నాప్ల వైపు మళ్లిందని.. ఈ ఘటన వెనుక వీరి పాత్ర ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మెక్సికోలో నేరప్రవృత్తి, హింస, గ్యాంగ్ గొడవలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి.
వందల కొద్దీ పక్షులు మృతి.. ఎక్కువ ఎక్కడంటే..!
సొంత చెల్లెలితో ఆస్తి గొడవ, వారితోనూ విభేదాలు!
ఆ హీరోతో నటించేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్న సాయి పల్లవి