- Advertisement -
రెండుతెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లు గవర్నర్ తో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రాజ్భవన్లో జరిగే ఇఫ్తార్ విందులో భాగంగా జగన్ విజయవాడనుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా రాజ్భవన్కు చేరుకోగా, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు.
రంజాన్ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శనివారం సాయంత్రం రాజ్భవన్లో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు అయ్యారు. సీఎం హోదాలో మొదటిసారిగా జగన్ హైదరాబాద్లో అడుగు పెట్టారు.