Sunday, April 28, 2024
- Advertisement -

ఎంపీ రఘురామకృష్ణరాజుకు స్వల్ప ఊరట!

- Advertisement -

వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. మరి కాసేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆయనను జైలు నుంచి ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు సీఐడీ అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యల కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు స్వల్ప ఊరట కలిగింది. అంతేకాకుండా ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల నివేదికను పరిశీలించిన స్పెషల్ డివిజన్ బెంచ్… రఘురామ తరఫు న్యాయవాదుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంది.

కాగా, రమేశ్ ఆసుపత్రిలో పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాన్ని పట్టించుకోలేదని రఘురామ తరఫు న్యాయవాదులు డివిజన్ బెంచ్ కు విన్నవించారు. కస్టడీలో ఉండగానే సీఐడీ అధికారి పిటిషనర్ (రఘురామ)ను కలిశారని, కస్టడీలో ఉండగా కలవడం చట్టవిరుద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రఘురామను కోర్టు అనుమతి లేకుండా జైలుకు తరలించారంటూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రఘురామకు జైలులో ప్రాణ హాని ఉందని ఆయన తరపున న్యాయవాది వాదించారు.

సీఐడీ కోర్టు, ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్లోని కొన్ని అంశాలను మాత్రమే ఎలా పరిగణనలోకి తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. అయితే మెడికల్ రిపోర్టును పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయి అఫిడవిట్‌ను ఫైల్ చేయాలని రఘురామ తరపున న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు.. సీల్డ్‌ కవర్‌లో మెడికల్‌ రిపోర్టును జిల్లా కోర్టుకు సమర్పించారు. రఘురామ మెడికల్‌ రిపోర్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు గుంటూరు జిల్లా జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.

తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు!

కరోనా బాధితులకు ‘మనం సైతం’అంటున్న కాదంబరి కిరణ్

అత్తారింట్లో మెగా డాటర్ ఎంజాయ్.. ఫోటోలు వైరల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -