- Advertisement -
వైఎస్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని హైకోర్టు కొద్దిసేపటి క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దుపై గుత్తేదారు సంస్థ నవయుగ, సోమవారం నాడు కోర్టును ఆశ్రయించగా, విచారించి తీర్పును రిజర్వులో వుంచిన హైకోర్టు, ఈ మేరకు స్టే ఇస్తూ, ఆదేశాలు జారీ చేసింది. రివర్స్ టెండరింగ్ పై ముందుకు వెళ్లవద్దని, పూర్తి వివరాలతో తమకు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.