Thursday, May 9, 2024
- Advertisement -

బోటు ఆపరేటర్ల లైసెన్సులు రద్దు

- Advertisement -

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ బోటు లైసెన్సులను పర్యాటక శాఖ రద్దు చేసింది. కృష్ణా నదిలో పెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాద నేపధ్యంలో మంగళవారం అత్యవసన సమావేశం ఏర్పాటు చేసింది. సచివాలయంలో పర్యాటక శాఖలో జరిగిన ఈ బేటీలో మంత్రి భూమా అఖిల ప్రియ ప్రైవేటు ఆపరేటర్లతో సమావేశమయ్యారు.

బోటు వ్యవహారాలు, భద్రత, రక్షణ అంశాలపై విధివిధానాలు రూపోందించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసారు. కమిటీ సూచన మేరకు కొత్తగా ప్రైవేట్ బోటు లైసెన్సులు ఇవ్వనున్నారు. ఈ సమావేశానికి కొంతమంది ఆపరేట్లరు రాకపోవడంపై మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేస్తూ హాజరుకాని బోటు యజమానులుకు మరోసారి లైసెన్సులు ఇవ్వరాదని అధికారులను ఆదేశించారు. అలాగే అధికారులను ప్రాంతాల వారిగా వివరాలడిగి తెలుసుకున్నారు. కాగా… లైఫ్ జాకెట్లను టూరిజం శాఖ సరఫరా చేస్తోన్నా బోటు ప్రయాణీకులకు ఎందుకు అందించడం లేదని మంత్రి నిలదీసారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -