Monday, May 20, 2024
- Advertisement -

బాలయ్యను అవమానించిన బాబు?

- Advertisement -

సినీ హీరో, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణకు రాజధాని భూమి పూజ రోజు అవమానం జరిగిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ అభిమానులు చాలా మంది ఆయన మాట్లాడాలి అని ఆ ప్రాంగణం మొత్తం మారు మ్రోగేలా అరిచినా చంద్రబాబు నాయుడు పట్టింఛుకోలేదు.

ఏపి ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత అభిమానుల కోసం మాట్లాడాలని స్టేజ్ మీదకు వచ్చిన బాలకృష్ణకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదని సమాచారం. చంద్రబాబు మాత్రం ఆయన కృషి వల్లే హైదరాబాద్ ఇప్పుడు అంత పెద్ద మహా నగరంగా అయింది అంటూ మాట్లాడుతున్నారు తప్ప అభిమానులు బాలయ్య మాట్లాడాలనే అరుపులు మాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబు కొడుకు అయిన లోకేశ్ ను మాత్రం పొగడ్తలతో ముంచెత్తారు. ఎమ్మేల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో లొకేశ్ బాబు సిఎం అవుతారని, భువనేశ్వరి ఇప్పుడు గ్రాండ్ మథర్ అయ్యారని అలానే రాబొయే రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి తల్లి కూడా అవుతారని ప్రశంసించారు. అది విన్న చంద్రబాబు నవ్వుకున్నారు.
 ఏది ఏమైనా లోకేశ్ కు ఇచ్చినంత ప్రాముఖ్యత కూడా బాలయ్యబాబు కు ఇవ్వకపోవడం చర్చనీయాంశమవుతోంది. బాలయ్య అభిమానుల్లో ఈ విషయం అసంతృప్తిని నెలకొందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -