Thursday, May 9, 2024
- Advertisement -

మోడీ మీద పోలీసు కేసు .. తన భర్త ని మోడీ ఏ చంపాడు అంటూ 

- Advertisement -
Case lodged against PM Narendra modi in phirangipuram police station

పెద్ద నోట్ల రద్దు విషయంలో మోడీ తీసుకున్న నిర్ణయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఆయన నవంబర్ ఎనిమిది న దేశం మొత్తం మీద రుద్దిన ఆ రూల్ మొదట బాగానే ఉన్నా ప్రస్తుతం సామాన్యుడు ఈ విషయం లో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. సామాన్యులు atm సెంటర్ ల దగ్గర తమ ఆక్రోశం వెళ్ళ గాక్కుతున్నారు .. ఇప్పుడు ఏకంగా ఒక మహిళ మోడీ మీదా తన నిర్ణయం మీదా పోలీసు కేసు వేసింది.

తన భర్త మరణానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీయే కారణమని ఆరోపిస్తూ ఓ మహిళ గురువారం ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇటీవల గుంటూరు జిల్లా ఫిరంగిపురం ఆంధ్రాబ్యాంకులో నోట్ల మార్పిడికి వెళ్లి కోలంకి ఇన్నయ్య క్యూ లైన్ లోనే మృతి చెందాడు. ఈ మేరకు ఆయన భార్య రోజ్ మేరి తన కుటుంబసభ్యులతో కలసి ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీసు స్టేషన్ కు వచ్చింది.

అయితే పోలీసులు కేసు నమోదుకు నిరాకరించారు. ఉన్నతాధికారులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  ఇదిలాఉండగా పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు టీజెఆర్ సుధాకర్ బాబు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -