Saturday, May 4, 2024
- Advertisement -

తప్పించుకొనే ఐడియాలు ఇవ్వడం లేదని అధికారులపై మండిపడ్డ బాబు!

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారంలో ఎలా బయటపడాలనే అంశం గురించి తీవ్రమైన కసరత్తు చేస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఈ వ్యవహారంలో బాబు ఆడియో టేపులతో ఇరుక్కుపోయాడు. ఆ టేపుల్లోని మాటలు తనవి కావని బాబు చెప్పడం లేదు. అలాగని ఒప్పుకోవడం లేదు. ఏదో దబాయిస్తూ.. బుకాయిస్తూ బండి లాక్కొస్తున్నాడు.

మరి ఇలా బుకాయిస్తే కాదు.. పూర్తిగా బయటపడాలి. దానికో మాస్టర్ ప్లాన్ కావాలి.

దీని కోసమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ముఖ్యులతో.. ప్రభుత్వంలోని ముఖ్య అధికారులతో బాబు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బాబు అధికారులపై మడి పడ్డారు.ఎలా బయటపడాలనే అంశం గురించి చర్చలో బాబుకు ఏపీ అధికారుల మాటలు కోపం తెప్పించాయి. రేవంత్ వీడియో టేపుల్లో “బాస్” అనేమాట హైలెట్ అయ్యిందని.. ఆ బాస్ తనే అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి.. ఆ స్థానంలో మరొకరిని ఇరికిద్దాం అని బాబు ప్లాన్ వేశారు.

ఈ ప్లాన్ ను అంరదికీ వివరించారు. అయితే ఇలా చేస్తే మరో ప్రమాదం ఉందని.. బాస్ గాతెలంగాణ టీడీపీ నేతలను ఎవరినైనా ఇరికిస్తే చెడ్డపేరు వస్తుందని, అధికారులు బాబు దగ్గర వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ అధినేతకు ఒక్కసారిగా ఆగ్రహం వచ్చింది. దీంతో ఆయన ” ఈ కేసు వ్యవహారం నుంచి తప్పించుకొనే ఐడియానూ ఇవ్వరు.. నేను ఏదైనా ఐడియా చెబితే.. దానికీ ఏదో ఒక అడ్డు చెబుతారు..” అంటూ బాబు అధికారులపై మండి పడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఓటుకు నోటు వ్యవహారం బాబుకు హై బీపీని తెప్పిస్తోంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -