బికాంలో ఫిజిక్స్ చదివిన వారికి నా లెక్కలు అర్థం కావు అని జగన్ అద్దిరిపోయే పంచ్ వేయడంతో చంద్రబాబుకు , టీడీపీ నాయకులకు దిమ్మతిరిగిపోయింది…జగన్ చేస్తున్న విమర్శలకు సమాధానం చెప్పలేక టీడీపీ మంత్రులు నీళ్లు నమిలారు. జగన్కు తగ్గ సమాధానం చెప్పే సత్తా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలలో కనిపించడం లేదని చంద్రబాబు వర్రీ అవుతున్నాడు…జగన్పై అడ్డగోలుగా నోరు పారేసుకుంటున్నారని వైసీపీ చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇవ్వలేకపోతున్నారని చంద్రబాబు ఫీల్ అవుతున్నారు..
దీంతో జగన్ని ఎదుర్కోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఆపరేషన్ జగన్ పేరుతో ఓ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. అందుకోసం టీడీపీలో దూకుడుగా ఉండే ఓ 40 మంది ఎమ్మెల్యేలను ఎంచుకుంది. ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వారికి డైరెక్షన్లో వారికి ట్రైనింగ్ జరిగింది. గత రెండున్నరేళ్లుగా జగన్ పై అసెంబ్లీలో ఇలాంటి ప్లానే వర్కవుట్ చేస్తున్నామని.. ఈసారి మరింత ఎఫెక్టివ్గా ఉండేలా, జగన్ని నోరు ఎత్తకుండా మా వాళ్లు మూకుమ్మడిగా దాడి చేయబోతున్నట్లు ట్రైనింగ్ తీసుకున్న ఓ టీడీపీ ఎమ్మెల్యే చెప్పినట్టు సమాచారం.
ఇలా రాష్ట్రంలోని 40 మంది ఎమ్మెల్యేలకు ట్రైనింగ్ ఇచ్చి అంశం ఏదైనా జగన్ పై దూకుడుగా వ్యవహరించి ఆయనకు చెక్ పెట్టడమే మన ఎజెండా అని డిసైడ్ చేసేశారంట బాబుగారు.. అయితే సమావేశం జరుగుతుండగానే నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం చెందినట్లు సమాచారం అందడంతో అర్ధంతరంగా ముగించారు. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఒకే ఒక్కడు జగన్ కు, ఆలీబాబా నలభై దొంగల్లాగా చంద్రబాబా, నలభై తమ్మళ్ల మధ్య యుద్ధం భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉంది.. జగన్ కి చంద్ర బాబుకి మధ్య పోరులో జగన్ దే అంతిమ విజయం అని జగన్ అభిమానులు అంటున్నారు.