అండర్ వరల్డ్ డాన్ చోటారాజన్ కరోనాతో మృతి చెందారనే విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే చోటా రాజన్ మృతి చెందినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ అధికారులు కొట్టిపారేశారు. చోటా రాజన్ ఇంకా బతికే ఉన్నాడని స్పష్టం చేశారు. ఇక రాజన్ కరోనాతో మృతి చెందినట్లుగా శుక్రవారం(మే 7) అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే ఆ తర్వాత కాసేపటికే ఎయిమ్స్ అధికారులు దీనిపై స్పందించి స్పష్టతనిచ్చారు. ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న రాజన్ కు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో, ఆయనను ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా, భారత్ కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న రాజన్ 2015లో ఇండొనేషియా నుంచి పోలీసు అధికారులు తీసుకొచ్చారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య అతన్ని తీహార్ జైల్లో ఉంచారు.
మరోసారి మంచి మనసు చాటుకున్న సల్మాన్ ఖాన్