అంతర్జాతీయ సంకేతాలతో సోమవారం భారీ లాభాలను ఆర్జించిన స్టాక్మార్కెట్లు మంగళవారం మాత్రం స్వల్పలాభాలతో ముగిశాయి. ఆరంభంలో సెంచరీ లాభాలతో మురిపించినా, మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో స్వల్ప ఒడిదుడుకుల మధ్య కన్సాలిడేట్ అయిన కీలక సూచీలు చివరికి స్వల్ప లాభాలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ స్వల్పంగా 2 పాయింట్లు ఆర్జించింది.
ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, కొనుగోళ్ల అండతో ఈ ఉదయం సూచీలు ఉత్సాహంగానే ప్రారంభమయ్యాయి. ప్రీ ట్రేడింగ్లో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైనే లాభపడగా.. నిఫ్టీ కూడా 10,750 మార్క్ పైన ట్రేడ్ అయ్యింది. అయితే ఇరాన్ డీల్పై మరికొద్ది గంటల్లో నిర్ణయం వెల్లడిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంపై దృష్టి పెట్టిన మదుపర్లు అప్రమత్తత పాటించారు.దీంతో ఒడిదుడుకులకు మార్కెట్లు లోనయ్యాయి.
చివరకు సెన్సెక్స్ 8 పాయింట్ల స్వల్ప లాభంతో 35,216 వద్ద, నిఫ్టీ కూడా కేవలం పాయింట్లు పెరిగి 10,718 వద్ద ముగిసింది. అయితే కీలక మద్దతు స్తాయిలకు పైన నిలవడం సానుకూల సంకేతం. బ్యాంక్ నిఫ్టీ, రియల్టీ లాభపడగా, ఆటో, ఐటీ, ఫార్మా, మెటల్ , అండ్ మహింద్రా, ఎల్ అండ్ టీ, ఇన్ఫోసిస్, జీ ఎంటర్టైన్మెంట్స్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టపోయాయి .
హెచ్పీసీఎల్, ఐషర్, బీపీసీఎల్, ఎస్బీఐ, పవర్గ్రిడ్, యాక్సిస్, ఐవోసీ, గ్రాసిమ్, ఎయిర్టెల్ లాభపడిన వాటిల్లో ఉన్నాయి. రోవై పు సోమవారం ప్రకటించిన క్యూ4 ఫలితాల్లో 45శాతం నష్టపోయిన ఐసీఐసీఐ బ్యాంకు నేడు దాదాపు 7 శాతం పుంజుకోవడం విశేషం. ఒకానొక దశలో బ్యాంకు షేరు విలువ 9శాతానికి పైగా పెరిగింది. మార్కెట్ ముగిసే సమయానికి ఎఎస్ఈలో బ్యాంకు షేరు 6.45శాతం లాభపడి రూ. 308.50గా ఉంది. ఇక బీఎస్ఈలోనూ 6.86శాతం లాభంతో రూ. 309.25గా ఉంది.