సిజెఐ జస్టిస్ ఎన్.వి.రమణ 48వ సిజెఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జస్టిస్ రమణ పలువురు సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలుపుతూ.. ఆయన విశేష అనుభవం దేశానికి ఎంతో ప్రయోజనకరం అన్నారు. జస్టిస్ ఎన్.వి.రమణ పదవీకాలం గొప్పగా సాగాలిని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
మన తెలుగు తేజం ఎన్వీ రమణగారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు. ఆయన వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ అని చిరంజీవి గుర్తు చేశారు.
ఆయన సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడని, గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడని ప్రశంసించారు. కాగా, భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి.రమణతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ప్రమాణం చేయించారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు.
కాంగ్రెస్ ఎంఎల్ఎ కళావతి కరోనాతో మృతి
వైద్య, ఆరోగ్యశాఖకు తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు!
కరోనా గ్రామాల్లో విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి : ప్రధాని మోదీ