కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్కు చెందిన రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ (71).. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ మేరకు ఆయన కుమారుడు ఫైజల్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడి.. పలు అవయవాలు దెబ్బతిన్నట్లు చెప్పారు.
71 ఏళ్ల పటేల్ తాను కొవిడ్ బారిన పడినట్లు అక్టోబర్ 1న ట్విటర్ ద్వారా తెలిపారు. అనంతరం నవంబర్ 15న ఆసుపత్రిలో చేరారు. కొద్ది రోజులుగా ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నారు.
అహ్మద్ పటేల్జీ మరణించారని తెలిసి బాధపడ్డా. ప్రజా జీవితంలో ఆయన ఎన్నో ఏళ్లు గడిపారు. సమాజానికి సేవ చేశారు. ఆయన చురుకైన వ్యక్తి. కాంగ్రెస్ను బలోపేతం చేయటంలో ఆయన పాత్ర మరువలేనిది. అహ్మద్ కుమారుడు పైజల్తో మాట్లాడాను. అహ్మద్ జీ ఆత్మకు శాంతి చేకూరాలి అని మోదీ సోషల్ మీడియా వేదికగా అన్నారు.
మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?