Friday, April 26, 2024
- Advertisement -

మరో ముగ్గురు బలి… మాస్క్ పని ఎక్కడ బాబు..!

- Advertisement -

తెలంగాణ లో రోజు రోజుకీ కరోనా క్రియాశీల కేసులు భారీగా పెరుగుతున్నాయి. మార్చి ఒకటో తేదీకి రాష్ట్రంలో కేవలం 1907 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. నేటికి వాటి సంఖ్య 4,665కి పెరిగాయి. రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి క్రియాశీల కేసులే నిదర్శంగా నిలుస్తున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 684 మంది మహమ్మారి బారిన పడినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కేసులతో ఇప్పటి వరకు వైరస్ సోకిన వారి సంఖ్య 307,889కి చేరింది. తాజాగా 684 మంది కోలుకోగా… ఇప్పటి వరకు 301,227మంది కోలుకున్నారు.

మరో ముగ్గురిని మహమ్మారి బలితీసుకోగా… మొత్తం మరణాలు 1697కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,665 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 1,873 మంది ఐసోలేషన్​లో ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 184 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 56,122 మందికి కొవిడ్ పరీక్షలు చేశారు.

ఇక కరోనా బారిన పడుతున్న వారిలో సుమారు 47 శాతం మంది 20 నుంచి 40 ఏళ్ల మధ్య వారే కావటం గమనార్హం. మహమ్మారి సోకిన వారిలో ఇటీవల చాలా స్వల్పంగానే లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏ మాత్రం కరోనా సిప్టమ్స్ ఉన్నా.. తక్షణం పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది. ఫలితంగా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని విన్నవిస్తోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్లక్ష్యం.. ఆ పోలీస్ మృతి..!

సాగర్ ఉప ఎన్నిక ఎఫెక్ట్.. బీజేపీకి వరుస షాకులు!

నితిన్ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -