Sunday, May 19, 2024
- Advertisement -

కింగ్ ఆడిస్తున్నాడు కుర్రాళ్లు ఆడేస్తున్నారు

- Advertisement -

కింగ్ నాగార్జున ఎంత గొప్పటి బిజినెస్ మేన్నో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అతను చేసే దందాలో ప్రతి అడుగు… ఎంతో ఆచితూచి పడుతుంటుంది.

అలాంటిది అతని కొడుకు అఖిల్ డెబ్యూ చిత్రం విషయంలో మాములుగా  పడుతుందా చెప్పండి. ఒక్క మాటలో చెప్పాలంటే… అఖిల్ తో పాటు నితిన్ కూడా కింగ్ ఎలా ఆడమంటే అలా ఆడేస్తున్నారు. దీంతో ఇండస్త్రీలో నాగార్జున, నితిన్ ల మద్య విభేదాలు తలెత్తాయని కొడై కూస్తుంది.

సినిమాను 2గంటల 40 నిమిషాలు కాకుండా 2గంటల10నిమిషాలు ట్రిమ్ చేయమని దర్శక నిర్మాతలకు అల్టిమేటమ్ జారీ చేశాడు.

కింగ్ ఆర్డర్ వేసాక వీరు మాట వినకుండా ఉంటారా చెప్పండి. సరే అన్నారు. లాగ్ లేకుండా టెర్రిఫిక్ గా సినిమా కనిపించడం కోసమే ఇలా చేసినట్లుగా ఫిలింనగర్లో చెపుకుంటున్నారు. దర్శకుడు వినాయక్ కూడా నాగ్, నితిన్ ఏదంటే అది అంటున్నాడు తప్ప…తన వ్యక్తిగత అభిప్రాయాలకు విలువ ఇవ్వడం లేదట. దానికి కూడా కారణం లేకపోలేదు.రేపన్న రోజు ఏమైనా తేడా వస్తే…అంతా మీరే చేశారు అని వినాయక్ చెప్పడానికంటూ తన దగ్గర ఏదో ఒక లొసుగు ఉండాలి కదా.అదే ఇదే కావచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -