Sunday, April 28, 2024
- Advertisement -

ప్ర‌త్యేక హోదా కోసం మ‌రొక‌రు ప్రాణ‌త్యాగం…

- Advertisement -

ఏపీకీ ప్ర‌త్యేక హోదాకోసం మ‌రో ప్రాణం బ‌లి అయ్యింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం రాజమండ్రికి చెందిన దొడ్డి త్రినాథ్ (28) అనే యువకుడు ఆత్మార్పణ చేశాడు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం కాగిత వద్ద సెల్ టవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగానికి పాల్పడినట్టు సూసైడ్ నోట్‌లో రాశాడు. సంఘటన స్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరిట మృతుడు సూసైడ్ నోట్ రాశాడు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఉద్దేశించి ఆయన లేఖ రాశాడు.

ప్రత్యేక హోదా కోసం అందరూ ముందుకు రావాలని ఆయన ఆ లేఖలో కోరాడు. అమ్మా నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పుతున్నానని అని ఆ లేఖలో పేర్కొన్నాడు. తన కుటుంబసభ్యులను ప్రస్తావించి తనను క్షమించాలని కోరాడు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోకూడదని రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాలు కోరుతున్నా ఆత్మ‌హ‌త్య‌లు ఆగ‌డంలేదు.

త్రినాథ్ రాసిన సూసైడ్‌ నోట్‌లో….
‘అయ్యా.. సీఎం గారు హైద్రాబాద్ విషయంలో మీరు చూపించిన అభివృద్ధిని, ప్రత్యేక హోదా విషయంలో చూపించండి. అప్పుడే నా మరణానికి ఒక అర్ధం, మా అమ్మ నన్ను కన్నందుకు ఒక ప్రయోజనం, ప్లీజ్ సిట్. కేరళ వరదల్లో ఉందని అందరూ ముందుకొచ్చి ఆదుకోవాలని తమ సమయాన్ని ధన రూపంలోను, మాటల రూపంలో ఆదుకుంటున్నారు. ముఖ్యంగా మీడియా, సినీ ప్రముఖులు ముందుకొచ్చి సహాయాన్ని అడుగుతున్నారు. ఇది తప్పు అని అనడం లేదు. కానీ అంతకన్నా ఎక్కువ వరద బాధితులు సార్ ఏపీ ప్రజలు. దయచేసి గుర్తించండి. ప్రత్యేక హోదా విషయంలో సినీ, రాజకీయ, పారిశ్రామివేతలు ఆదుకోవాలి. మాట తప్పినందుకు అమ్మా నన్ను క్షమించు. అమ్మను జాగ్రత్తగా చంటిపిల్లలా చూసుకోండి’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -