దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో జనాలు భయంతో వణికిపోయారు. ఇళ్లనుంచి పరుగులు తీశారు. భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఢిల్లీలోని ఎన్సిఆర్ ప్రాంతంలో – నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ అంతటా ప్రకంపనలు వచినట్టు అధికారులు తెలుపుతున్నారు. భూకంప తీవ్రత రెక్టార్ స్కెల్ పైన 6.1గా నమోదు అయ్యింది.
భూకంపం శుక్రవారం రాత్రి 10:34 గంటలకు పంజాబ్లోని అమృత్సర్ను తాకినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. శుక్రవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. రాత్రి 10:34 గంటలకు పంజాబ్లోని అమృత్సర్ను తాకినట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. పాకిస్తాన్ లో కూడా భూమి కంపించింది.
రెక్టార్ స్కెల్ పై భూకంప తీవ్రత 6.4 గా నమోదైంది. ఢిల్లీ లో సంభవించిన భూకంపం పై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సిఎస్) ప్రకారం, జైపూర్కు వాయువ్యంగా 64 కిలోమీటర్ల దూరంలో ఉదయం 11 గంటలకు ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీలో భూకంపం సంభవించిందని, అందరు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేసారు.
తమిళనాడులో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 11మంది మృతి.. 22మందికి తీవ్ర గాయాలు!