Friday, May 10, 2024
- Advertisement -

కరోనాతో మాజీ ఎంఎల్ఎ గౌరీశంకర్ దత్తా మృతి

- Advertisement -

దేశంలో కరోనా తీవ్రత ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక కరోనా కాటుకు ప్రముఖులు, రాజకీయ నేతలు, సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా క‌రోనాతో మాజీ ఎంఎల్ఎ, బిజెపి నాయకుడు గౌరీశంకర్ దత్తా (70) గురువారం కన్నుమూశారు.

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు టిఎంసి అధిష్ఠానం నిరాకరించింది. దీంతో ఆయన బిజెపిలో చేరారు. కాగా, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గౌరీశంకర్ దత్తా నదియా జిల్లాలోని తెహట్టా అసెంబ్లీ స్థానం నుంచి టిఎంసి అభ్యర్థిగా పోటీ చేసి ఎంఎల్ఎ గా విజయం సాధించారు. గత వారం రోజుల క్రితం ఆయన కరోనా భారిన పడ్డారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి గురువారం ఉదయం కన్నుమూశారు. గౌరీశంకర్ దత్తా మృతిపై పలువురు బిజెపి ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత డిజైనర్ విషెస్!

మీకు అర్థమవుతుందా అంటూ.. టాటూ సీక్రెట్స్ రివీల్ చేసిన రష్మిక!

వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి.. తనకంటే చిన్నవాడితో పట్టుపడడంతోనే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -