- Advertisement -
పాన్కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన వారికి సీబీడీటీ శుభవార్త చెప్పింది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు పొడిగించినట్లు తెలిపింది. పాన్కార్డుకు ఆధార్ అనుసంధానం గడువును ఇప్పటికే పలుసార్లు పొడిగించిన విషయం తెలిసిందే.
తమ పాన్ కార్డు లేక ఆధార్ కార్డుల్లో తప్పులు ఉండడం వంటి పలు కారణాల వల్ల ఇప్పటికీ కొందరు పాన్కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయారు. ప్రభుత్వం అన్నింటికీ ఆధార్ కార్డు తప్పని సరి చేస్తుండడంతో గోప్యత హక్కులకు విఘాతం కలుగుతోందని గతంలో దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది డిసెంబర్ 15న సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ జరిపినపుడు పాన్ కార్డుకి ఆధార్ అనుసంధానం గడువును ఈ ఏడాది మార్చి 31వరకు పొడిగించిన విషయం తెలిసిందే.