సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకి దిగజారుతున్నాయి.వివహేతర సంబంధాలు ఎక్కువైయ్యాయి.తాజాగా అలాంటి సంఘటనే ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.పూర్తి వివరాల్లోకి వెళితే…కొత్తతండాకు చెందిన బానోత్ భద్రు, మాలోతు లింగన్న(24) మామ అల్లుళ్లు. భద్రుకు పదేళ్లక్రితం ఖమ్మం జిల్లాకు చెందిన యువతితో వివాహమైంది. వీరికి కుమారుడు ఉన్నా డు. అయితే వరుసకు అత్త అయ్యే ఆమెతో లింగన్నకు వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈ విషయం భర్త భద్రుకు తెలియడంతో లింగన్నను మందలించి ,భార్యను హెచ్చరించాడు.
దీంతో భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రాకపోవడంతో భద్రు లింగన్నపై కక్ష పెంచుకున్నాడు. లింగన్న వల్లే భార్య తనని వదిలేసి వెళ్లిపోయిందని కక్ష పెంచుకున్న లింగన్న గొడ్డలితో తలపై నరికాడు. తీవ్రగాయాలపాలైన లింగన్నను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పటికే భద్రుకు మూడు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుస్తుంది.మొదటి భార్యతో విడాకులు అయ్యాయి. రెండో భార్య అనారోగ్యంతో మృతి చెందింది. మూడో భార్యసైతం తనకు దక్కకుండా పోవడంతో లింగన్నను చంపినట్లు సమాచారం.