Friday, March 29, 2024
- Advertisement -

పాతబస్తీకి వెళ్లి చూడండి పూర్తిగా కనిపిస్తారు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు..!

- Advertisement -

కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా పరీక్షలు, చికిత్సలపై వైద్యారోగ్యశాఖ, కరోనా మార్గదర్శకాల అమలుపై డీజీపీ వేర్వేరుగా నివేదికలు సమర్పించగా.. హైకోర్టు విచారణ జరిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా కేవలం లక్షా16 వేల మందికే జరిమానా విధించారనే వివరాలపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పాతబస్తీ వంటి ప్రాంతాల్లో రెండు రోజులు తనిఖీ చేస్తే లక్ష మంది దొరుకుతారని వ్యాఖ్యానించింది. నిబంధనల ఉల్లంఘనలపై సుమారు 22 వేలు, భౌతిక దూరం పాటించని వారిపై 2,416, రోడ్లపై ఉమ్మిన వారిపై ఆరు కేసులు నమోదు చేశామని.. డీజీపీ ఉన్నత న్యాయస్థానానికి నివేదించారు.

ఆర్టీపీసీఆర్​ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని మరోసారి హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం 70 శాతానికి పెంచాలని సూచించింది. సీరో సర్వైలెన్స్ ఆరు వారాల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం తెలపగా.. నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. లాక్‌డౌన్ లేకపోయినా.. కంటైన్‌మెంట్ జోన్లు కచ్చితంగా ఉండాలని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

అసలు లంకెబిందెలలో ఎంత దొరికింది అంటే..?

అక్కడ లేని పొలింగ్.. ఏవోబీ భయం భయం..!

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ నెక్స్ట్ మూవీ ఆయ‌న‌తోనేనా !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -