- Advertisement -
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనపై రెండు రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ, డీజీపీలకు ఆదేశాలు జారీచేశారు.
అటు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు సైతం ఈ ఘటన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగాయి. ఈ కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ సుదర్శన్ను నియమించింది ప్రభుత్వం.
బాధిత బాలిక స్టేట్మెంట్ను మరోసారి రికార్డు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read
కేఏ పాల్ నా కుటుంబంలో చిచ్చుపెట్టాడు