పేదలకు కడుపునిండా అన్నం పెట్టే ఆద్దేశ్యంతో టీ ప్రభుత్వం రూ.5 భోజన పథకాన్ని ప్రారంభించింది.ఇది విజయవంతం అయ్యింది.ఇదే స్పూర్తితో ఏపీలో టీడీపీ కూడా పేదలకు ఎన్టీఆర్ క్యాంటీన్ లద్వారా రూ.5 అన్నం పెట్టే పథకాన్ని ప్రారంభిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పర్యటాల సునీత ఘనంగా ప్రకటించారు.ఇది సీఎంచంద్రబాబు నాయుడు మరో పథకమని పచ్చ తమ్ముళ్లు డోలు బజాయించి చెప్పుకున్నారు.
అయితే టీడీపీ నోటి మాట చెబితే…వైసీపీ మాత్రం చేతుల్లో చేసి చూపించింది.గుంటూరు జిల్లా మంగళగిరి నియేజకవర్గం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాజన్న క్యాంటిన్లను ప్రారంభించారు.ఈక్యాంటిన్ల ద్వారా పేదలకు రూ.4 భోజనాన్ని అందించనున్నారు.క్యాంటిన్ ద్వారా రూ. 4 అన్నం,కూర,పెరుగు…వారంలో నాలుగురోజులు గడ్డు….మిగితా రోజుల్లో పండ్లు అందించనున్నారు.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజైన మే 14 రోజు రాజన్న క్యాంటిన్లను ప్రారంభించారు.
{loadmodule mod_custom,Side Ad 1}
నెలలో మూడు ప్రారంతాల్లో క్యాంటిన్ ద్వరా భోజనం అందిస్తారు.నెలలో పది రోజులు అంబేత్కర్ విగ్రహం సెంటర్…మరో పదిరోజులు మిద్దే సెంటర్….. మిగిలిన పదిరోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో భోజన అందజేయనున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు.ఎమ్మెల్యే సొంత నిధులతో ఈకార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read