Monday, April 29, 2024
- Advertisement -

టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వా… సీనీ నటుడు మోహ‌న్ బాబు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో గతంలో నామినేట్ పదవుల్లో నియమితులైనవారిలో కొందరు త‌ప్పుకున్నారు. వారి స్థానంలో కొత్ వారిని నియ‌మించేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌వుతున్నారు. ప్ర‌ధానంగా ఇప్పుడు టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌విపైనె అంద‌రి చూపు నెల‌కింది. మరికొందరు ప్రభుత్వం తమను తొలగిస్తే గానీ తప్పుకోమని భీష్మించుకొని కూర్చుకున్నారు. దీంతో జ‌గ‌న్ ఆర్డినెన్స్ తీసుకురానుంది. దీంతో, దేవాలయాల్లో పాలక మండళ్లు కూడా రద్దు కానున్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి చైర్మన్ పదవిపై పలువురు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర రెడ్డి, నటుడు మోహన్ బాబు కూడా ఈ రేసులో ఉన్నట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కాని ఆ వార్త‌ల‌పై సినీ న‌టుడు మోహ‌న్ బాబు స్పందించారు.

వైఎస్ జగన్ ను ఏపీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే నా కోరిక. అందుకే ఆ దిశగా నా వంతు ప్రయత్నం చేశాను. జగన్ ప్రజల సీఎం అవుతారన్న నమ్మకంతోనే నేను రాజకీయాల్లోకి తిరిగి వచ్చా. అంతేతప్ప నామినేటెడ్ పదవులు, వేరేవాటి కోసం కాదు’ అని స్పష్టం చేశారు. ఈ మేరకు మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఇలాంటి వార్తలను మీడియా ప్రచారం చేయవద్దని మరో ట్వీట్‌లో మోహన్ బాబు కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -