- Advertisement -
భారత వాయిసేనలో ప్రమాదాలు చోటు చేసుకోవడం ఈ మధ్యన సర్వ సాధారనం అయ్యింది. తాజాగా మరో ప్రమాదం చోటుచేసకుంది. వైమానిక దళం (ఐఎఎఫ్) మిగ్-27 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి రాజస్థాన్లో జోధ్పూర్ ప్రాంతంలో కూలిపోయింది. పైలెట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు.
సాంకేతిక సమస్యలతో పంటపొలంలో హెలికాఫ్టర్ కూలగా, ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఒక వాహనంతోపాటు రెండు ఇండ్లు ధ్వంసమయ్యాయి. విమానం కూలిపోవడానికి వెనక గల కారణాలు ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై ‘కోర్ట్ ఆఫ్ ఇంక్వయిరీ’కి ఆదేశించినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రకటించింది.