తన స్నేహితుడు ప్రధాని నరేంద్రమోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రత్యేకమైన బహుమతి ఇవ్వనున్నారు. త్వరలో ఆయన భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ విలువైన గిఫ్ట్ను మోదీకి అందించనున్నారు. కొన్ని నెలల క్రితం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించిన విషయం తెలిసిందే.
ఆ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యహూతో కలిసి మోదీ సముద్ర తీరంలో బగ్గీ జీపులో ప్రయాణించారు.దీంతో వారి స్నేహానికి గుర్తుగా ఆయన మోదీకి ఆ జీపునే బహుమతిగా ఇవ్వనున్నారు. కాగా, నెతన్యహూ ఈ నెల 14న భారత్కు రానున్నారు. మోదీ కోసం ఆయన ఆ జీపును తీసుకొస్తున్నారు.
ఆ జీపు ధర 3,90,000 షెకెల్స్ ( దాదాపు రూ.70 లక్షలకు పైగా) ఉంటుంది. ఆ జీపుకి రోజుకు 20 వేల లీటర్ల సముద్రపు నీటిని తాగునీరుగా శుద్ధి చేసే ప్రత్యేకత ఉంది. అదే అపరిశుభ్ర నదీ జలాలనైతే రోజుకు 80వేల లీటర్ల వరకు శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. వరదలు వచ్చినప్పుడు తాగునీటి కోసం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే, దీని వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.
సముద్రపు నీటిని శుద్ధిపరిచే సాంకేతిక పరిజ్ఞానం భారత్కు ఇజ్రాయెల్ అందించేలా ఒప్పందం అయిన విషయం తెలిసిందే. దీనికి గుర్తుగానే ఓల్గా బీచ్లో మోదీ, నెతన్యాహు కలిసి సముద్రపు నీటిని శుద్ధి పరిచే జీపులో కాసేపు సరదాగా గడిపారు.