- Advertisement -
హవాయిలోని కిలాయియా కిలాయియా అగ్నిపర్వతం భగ్గుమంది. లావా ధారాళంగా ప్రవహిచింది. అగ్నిపర్వతం ధాటికి ఆకాశంలో గ్యాస్, తేమ పెరిగాయి. బూడిద కూడా ఎగసిపడింది.కిలాయియా అగ్నిపర్వత ప్రాంతం సమీపంలోని ప్రజలకు ఈ పేలుడు వల్ల పెద్దగా ఇబ్బంది తలెత్తలేదని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
సోమవారం వరకు ఈ లావా ప్రవాహం కొనసాగింది. ఇది ఇంకా ఎంత సేపు ఉంటుందనేది అంచనా వేయలేమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గాలిలో ఎగసిపడిన బూడిద కళ్లకు, ఊపిరితిత్తులకు ప్రమాదకారమని హెచ్చరించారు.అయితే ఆదివారం అగ్నిపర్వతం పేలుడు మొదలైన గంట తర్వాత ఆ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.4 తీవ్రత నమోదైంది.