దేశంలో కరోనా ఉధృతి ఘోరంగా కొనసాగుతుంది. మద్యప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం.. మరణాల సంఖ్య పెరిగిపోవడం తో సీఎం కేజ్రీవాల్ గత వారం లాక్ డౌన్ ప్రకటించారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎంత తీవ్రంగా ఉందో చెప్పే ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
దేశంలోని అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ ఎస్కార్ట్ లోనూ ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. సోమవారం ఉదయం 6 గంటలకు ముగియనుంది. ఆ సమయంలో ఆయన లాక్డౌన్ పొడిగింపు అవకాశాలేవీ ఉండబోవని చెప్పినప్పటికీ.. ఆ పని చేయకతప్పలేదు. మరో వారం రోజులపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేజ్రీవాల్ ఈ రోజు ప్రకటించారు.
వచ్చేనెల 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని చెప్పారు. కరోనా విజృంభణ ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో లాక్డౌన్ విధించకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత చేజారిపోతాయని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
కరోనా ఉధృతిపై ప్రధాని మన్ కీ బాత్!