చైనాలో ఏవేవో జరిగిపోతున్నాయి.ఒకతను లాటరీ కొట్టిన ఆనందంలో తన పెళ్లానికి విడాకులు ఇచ్చేశాడు.
దీంతో ఆవిడగారు లబోదిబో మంటూ కన్నీళ్ల పర్యంతమైంది. ఎంతమంది జోక్యం చేసుకున్నా…ఆ లాటరీ కొట్టిన లక్కీగయ్ మాట వినకపోయే సరికి ఇక తప్పదనుకుని ఆమె కోర్టును ఆశ్రయించింది.
విషయంలోకి వెళితే….. లిజియాంగ్ అనే మధ్య తరగతి ఉద్యోగి… ఈఏడాది ఫిబ్రవరి 26 న భారీ లాటరీ కొట్టాడు. ఆ లాటరీ ద్వారా అతనికి 4.6 మిలియన్ యువాన్ లు వచ్చిపడ్డాయి. దీంతో అతని కోరికలు రెక్కలు తొడిగాయి. స్వేచ్చా జీవితంలో విహరించాలనుకున్నాడు.
అయితే దానికి తన భార్యను అడ్డంకిగా భావించాడు. ఆ తరువాతి రోజే లాటరీ ద్వారా వచ్చిన డబ్బును చూసిన మత్తులో తన భార్యకు విడాకుల నోటీసులు పంపించేశాడు. ఆ విధంగా మనోడు అతని భార్యగారు ద్వారా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం…. ఆమె భార్యకు అతను ఏకంగా 1.15 మిలియన్ యువాన్ లు మనోవర్తి కింద ఇవ్వాల్సి వచ్చింది.
అంటే వచ్చిందాంట్లో పావంతు అన్నమాట.దీంతో అతను కక్కలేక మింగలేక ఉండిపోయాడు. ఇక చివరకు పోయిందేదో పోయిందనుకుని..ఆమెకు మనోవర్తి అప్పగించేసి తాను కలలు కన్న స్వేచ్చా జీవితంలోకి అతను వెళ్ళిపోయాడు.