Saturday, April 20, 2024
- Advertisement -

జర్మనీ ఛాన్సలర్​కి మోదీ కరోనా పాఠాలు..!

- Advertisement -

జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో వీడియో టెలికాన్ఫరెన్స్​లో పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత్​లో కరోనా టీకాల అభివృద్ధి గురించి ఆమెకు వివరించారు. ప్రపంచ దేశాల ప్రయోజనాల కోసం భారత్ తన శక్తి సామర్థ్యాలన్నింటినీ వినియోగించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

జర్మనీ సహా ఐరోపా దేశాల్లో కరోనా కొత్త రకం స్ట్రెయిన్​ను విజయవంతంగా కట్టడి చేసినందుకు మెర్కెల్​కు అభినందనలు తెలిపారు మోదీ. భారత్-జర్మనీల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు ఆమె చేసిన కృషిని కొనియాడారు.

ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్​(ఐఎస్​ఏ)లో చేరాలని జర్మనీ తీసుకన్న నిర్ణయాన్ని మోదీ స్వాగతించారు. జర్మనీ-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమై 70 ఏళ్లు పూర్తైంది. వ్యూహాత్మక భాగస్వామ్యం నెలకొని 20 ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రభుత్వాల అంతర్గత సంప్రదింపుల 6వ సమావేశాన్ని నిర్వహించేందుకు మోదీ, మెర్కెల్​ అంగీకరించారు. త్వరలోనే తేదీలను ఖరారు చేయనున్నారు.

ఏం బలిసిందా.. బద్మాష్ సంజయ్‌?

సిడ్నీ టెస్టు: అతని చేతుల మీదుగా సైనీకి క్యాప్‌

వెన్న లాంటి పాటలు​ రాసిన​ వెన్నెలకంటి

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -