- Advertisement -
మోత్కుపల్లి నరసింహులు గవర్నర్ కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయా ? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎన్డీఏ లో భాగస్వామికాబట్టి టిడిపి కి ఓ గవర్నర్ పదవి ఇస్తామని బిజెపి నుంచి హామీ ఉంది. అది ఎప్పుడో అమలు కావాల్సి ఉన్నా అది ఆలస్యం జరుగుతూ వచ్చింది.
ఇటీవల మోత్కుపల్లిని తమిళనాడు గవర్నర్ గా నియమిస్తారని వార్తలు వచ్చినా ప్రస్తుతం మోత్కుపల్లిని అరుణాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా నియమించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.దీనికోసం ఇప్పటికే కేంద్రం మోత్కుపల్లి బయో డేటాని తెప్పించుకుని పరిశీలిస్తోంది.కాగా మోత్కుపల్లి తమిళనాడు వైపు గతంలో మొగ్గు చూపారు. కానీ తమిళనాడు గవర్నర్ గా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనంది బెన్ పటేల్ ను నియమించే అవకాశం ఉంది.దీనితో మోత్కుపల్లి తమిళనాడు పై ఆశలు వదులుకోవాల్సి వచ్చింది.