తెలుగుదేశంపైన, ఆ పార్టీ నేతలపైన తెగ గుస్సా అయిపోతోంది కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. తెలుగుదేశం పార్టీ దయతోనే రాజ్యసభ సభ్యురాలైన నిర్మలమ్మ కేంద్రంలో మంత్రిగా ఉంటూ..
ఆ పార్టీపైనే మండి పడుతోంది. ఈమెకు తెలుగుదేశంనేతలతో వరసగా వివాదాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలో తనను కలవడానికిప్రయత్నించే నేతలను కసుకోవడం విషయంలోనైతేనేమీ… ఏపీలోకి వచ్చినప్పుడు ఇక్కడి నేతలపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేయడంలోనైతేనేమీ.. నిర్మల తెలుగుదేశం పై ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తోంది.
మరి తెలుగుదేశం, భారతీయ పార్టీలు సన్నిహితమైనవి. మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో నిర్మల టీడీపీ నేతల విషయంలో ఇలా వ్యవహరించడం ఏమిటి? ఎందుకు? అంటే.. దానికి పెద్ద కారణమే ఉన్నట్టుంది.
ఆమె భర్తకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవి ఇవ్వకపోవడమే దానికి కారణమని తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ బాబు ప్రభుత్వంలో ముఖ్య సలహాదారుగా ఉన్నాడు. ఆయనను బాబు క్యాబినెట్ లోకి తీసుకోవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే అది జరగలేదు. దీంతో నిర్మలమ్మకు బాబు మీద కోపం ఉందట. అందుకే తెలుగుదేశం పార్టీ నేతలపై అవకాశం దొరికితే ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఆగ్రహాలు ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదీ కథ!