భారత్లో ఒమైక్రాన్ కేసులు రోజుకోజుకూ పెరిగిపోతున్నాయి. ఇవాళ కొత్తగా 3 ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొదట గుజరాత్లో రెండు కేసులు నమోదు కాగా, తాజాగా ముంబైలో మరోకరికి ఒమైక్రాన్ సోకినట్లు అధికారులు గుర్తించారు. టాంజానియా నుంచి వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్ సోకినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు దేశంలో ఒమైక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పల్లెటూర్లోకి పాకింది. మరి కరోనా కొత్త వేరియంట్ ఎలా ఉంటుంది. దీని ప్రభావం ఎవ్వరిపై పడుతుందనేది కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులుకు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ రెండు డోసులు వేసుకున్న వారికి బూష్టర్ బోస్ ఇచ్చేందుకు రేడీ అవుతోంది.
ప్రస్తుతం ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలో విళయతాండవం చేస్తుండగా.. ఈ రాబోయే రోజుల్లో భారత్లో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుదనేది అంతుచిక్కడంలేదు. గత రెండు వెవ్ల వల్ల ఉద్యోగాలు కోల్పొయి చాలా మంది రోడ్డున పడ్డారు. మరి ఈ వేరియంట్ ప్రభావం ఎంతమందిపై పడుతుందనేది చూడాలి.
ఆ తర్వాతే భారత్లో తార్డ్ వేవ్?