- Advertisement -
కాకినాడలో జనసేన ఆధ్వర్యంలోనిర్వహించిన బహిరంగ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. పవన్ కల్యాణ్ ప్రసంగించిన అనంతరం స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతుడ్ని దాక్షారామం మండలం కుయ్యేరుకు చెందిన శ్రీనివాస్గా గుర్తించారు. చికిత్స పొందుతున్న మరో యువకుడు వై.రామవరం గ్రామ వాస్తవ్యుడు.