యోగా గురువు బాబా రాందేవ్కు చెందిన పతంజలి సంస్థ వ్యాపార విస్తరణపై దృష్టి సారించింది. ఇప్పటికే ఆయుర్వేద రంగంలో నూ, నిత్యావసర సరుకుల వ్యాపారంలో దూసుకుపోతున్న పతంజలి ఇప్పడు మరో రంగంపై దృష్టిసారించింది. వ్యాపార విస్తరణలో భాగంగా పాలు, కూరగాయల వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది.
ఇక నుంచి మార్కెట్లో పతంజలి బ్రాండ్ పేరిట ఆవు పాలు, పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. పతంజలి సంస్థ టెట్రా ప్యాక్లలో లీటర్ ఆవు పాలను రూ.40కి అందిస్తోంది. పోటీ సంస్థల కంటే రూ.2 తక్కువకే పతంజలి పాలను విక్రయించనుంది. పతంజలి ఇప్పటికే ఆవు నెయ్యి, ఆవు పాల పొడిని విక్రయిస్తోంది.
వచ్చే ఏడాది రూ. 1000 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నామని బాబా రాందేవ్ చెప్పారు. ఈ ఏడాది రూ. కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. ప్రతి రోజు 10 లక్షల లీటర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
డైరీ రంగంలోకే కాకుండా దుస్తులు, చెప్పులను కూడా పతంజలి బ్రాండ్ పేరిట మార్కెట్లోకి తీసుకురానున్నారు. తొలి దశలో పతంజలి డైరీ ఉత్పత్తులను ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విక్రయిస్తామని బాబా రాందేవ్ తెలిపారు.