పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన ‘వకీల్ సాబ్’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు రాజకీయాలను అటు సినిమాలను బ్యాలెన్స్ చేతున్నవిషయం తెలిసిందే. వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించిన నివేద థామస్ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ అంతా కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఈ మూవీలో నటించిన మరో నటి అంజలీ కరోనా భారిన పడిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలు అవాస్తవం అని క్లారిటీ ఇచ్చింది అంజలీ. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాన్ ప్రస్తుతం క్వారంటైన్ లోకి వెళ్లారు. ఈమేరకు జనసేన పార్టీ అధ్యక్షులు ఒక ప్రకటనను విడుదల చేశారు.
ఇదిలా ఉంటే.. తిరుపతి ఉప ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.. ఆ స్థానంలో పోటీకి బీజేపీ-జనసేన తరఫున అభ్యర్థిగా రత్నప్రభ పోటీ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనపై సందిగ్ధత నెలకొంది. ఆయన కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ అని తేలితే మళ్లీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
పవన్ కళ్యాన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ : మంత్రి పెద్దిరెడ్డి