- Advertisement -
2019 ఎన్నికలు దగ్గరకొస్తున్న తరునంలో జనసేన పార్టీ మరో ముందడుగు వేసింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, విధి విధానాలు, లక్ష్యాలను తెలియచేసే కరదీపికను, పార్టీ పక్షపత్రిక శతఘ్నిని ఆపార్టీ చీఫ్ పవన్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
పార్టీ శ్రేణులకు సిద్ధాంతాలపై అవగాహన కల్పించడంతో పాటు, వారికి దిశానిర్దేశం చేసేలా కరదీపిక ఉంటుందని, ‘జనసేన’ సంకల్పం ఏమిటనేది ప్రతి పాఠకుడికి తెలియచేసేలా ‘శతఘ్ని’ ఉంటుందని పవన్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి జనసేన పార్టీ సభ్యత్వాన్ని 50 లక్షలకు చేరువయ్యేలా చేయాలని పార్టీ చీఫ్ వపన్ కళ్యాణ్ ఆదేశించారు. అంతేకాకుండా ఈ నెలలో వాడవాడలా జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించాలని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు.