సీపీఏం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇంట విషాదం చోటు చేసుకుంది. ఇటీవల కరోనా బారిన పడిన ఏచూరి పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి(34) కన్నుముూశారు. దేశంలో కొందరు కరోనాను జయిస్తుండగా, మరికొందరు కరోనాతో పోరాటంలో ప్రాణాలు కోల్పోతున్నారు. కోవిడ్-19 తో తన పెద్ద కుమారుడు ఆశిష్ ఏచూరి మృతి చెందినట్టు సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి తెలిపారు.
ఆశిష్ ఈ ఉదయం మృతి చెందాడని, ఎంతో బాధతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. అతనికి చికిత్స చేసిన డాక్టర్లు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మొదట హొలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేశారు. కానీ పరిస్థితి విషమించడంతో గురు గ్రామ్ లోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వెంటిలేటర్ పై చికిత్స అందించారు. ఈ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆశిష్ ఢిల్లీ కేంద్రంగా పని చేసే ప్రముఖ దినపత్రికలో సీనియర్ కాపీ ఎడిటర్ గా పని చేస్తున్నారు. కుమారుడి మృతితో ఏచూరి కుటుంబం షాక్లోకి వెళ్లిపోయింది.