పది సంవత్సరాల జగన్ కష్టానికి ఫలితం కాసేపట్లో తీరనుంది. నవ్యాంధ్ర ప్రదేశ్ సీఎంగా జగన్ కాసేపట్టో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 12.23 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం పీఠాన్ని తొలిసారి ఎక్కబోతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈ కార్యక్రమాన్ని జీవితాంతం గుర్తుండిపోయెలో మలిచేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి
మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లు అద్భుతంగా జరగితే… వాటిని మించిన రేంజ్లో పూల వర్షం కురిపించేందుకు ఓ హెలికాప్టర్ను సిద్దం చేశారు. ఇందుకోసం మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఓ హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం చేసే సమయంలో ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాలని నిర్ణయించారు. రంగురంగుల పూల రేకులను కిందకు జారవిడుస్తుంది హెలికాప్టర్. అవి తిన్నగా జగన్పై పడేలా ముందుగానే ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారం పూర్తయ్యేంత వరకు పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.