Sunday, May 5, 2024
- Advertisement -

అలాంటివి ఇక ట్విట్టర్ లో ఉండవు..!

- Advertisement -

కొవిడ్​-19 వాక్సినేషన్​కు సంబంధించి తమ సైట్​లో ఉన్న తప్పుడు సమాచారాన్ని తొలగిస్తామని ట్విటర్ ప్రకటించింది. వైరస్​, వ్యాక్సిన్ల గురించి ఇప్పటికే ఉన్న అసత్య ట్వీట్లను ఓ జాబితాగా చేశామని తెలిపింది.

వచ్చే వారంలో కొత్తగా తీసుకురానున్న విధానాల గురించి ట్విట్టర్​ తన బ్లాగ్​లో పోస్ట్ చేసింది. ఈ విధానాలకు విరుద్ధంగా ఖాతాదారులు ట్వీట్ చేస్తే వాటిని తొలగించి, వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్​ ప్రక్రియకు ఆ దేశం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో.. ఈ కొత్త నిబంధనలను తీసుకొస్తున్ననట్లు తెలిపింది ట్విట్టర్.

టీకాకు సంబంధించి వదంతులు, వివాదాస్పద సందేశాలు, అసంపూర్ణ వార్తలకు మా మాధ్యమంలో చోటు ఉండదు” అని ఆ సంస్థ స్పష్టం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -