అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను తన ప్రియులతో కడతేర్చిన ఘటన తమిళనాడు చోటు చేసుకుంది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో షాపులు మూసి ఎంతో మంది ఇంటి వద్దనే ఉంటున్నారు. ఇదే ఓ వ్యక్తి చావుకు కారణం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోబి చెట్టిపాళ్యం సమీపంలోని కుమార పాళ్యంకు చెందిన శ్రీనివాసన్ స్థానికంగా సెలూన్ దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఆయనకు భార్య ప్రభ, కుమార్తె(10) ఉన్నారు. మంగళవారం తన భర్త శ్రీనివాసన్కు శ్వాస ఆడడం లేదని, కరోనా వచ్చినట్టు అనుమానంగా ఉందంటూ ప్రభ కన్నీరుమున్నీరైంది. తనకు సహాయం చేయాలని చుట్టు పక్కల వారిని అడిగింది.. కానీ కరోనా భయంతో ఆమెకు ఎవరూ సహాయం చేయలేదు. దాంతో ఇద్దరు వ్యక్తులతో ఆమె ఆసుపత్రికి తీసుకు వెళ్లింది.. అప్పటికే శ్రీనివాసన్ కన్నుమూశాడు. దాంతో కన్నీరు మున్నీరైన ఆమె భర్తను ఇంటికి తీసుకు వెళ్లాలనుకుంది.. అంతలోనే శ్రీనివాసన్ మరణవార్త తెలుసుకున్న ఆయన సమీప బంధువొకరు ఆస్పత్రికి వచ్చాడు.
అంతకు ముందు రోజు వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న శ్రీనివాసన్ సడెన్గా చనిపోవడంపై ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో శరీరాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా మెడ భాగంలో గాయం కనిపించింది. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి ప్రభను అదుపులోకి తీసుకుని విచారింగా అక్రమ సంబంధం బయటపడింది. ప్రభకు అదే ప్రాంతానికి చెందిన శరవణ కుమార్, పొరోటా వెల్లింగిరితో కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. లాక్ డౌన్ కారణంగా శ్రీనివాసన్ ఇంటి వద్దనే ఉండటంతో ప్రభ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఇద్దరు ప్రియుల సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ