Wednesday, April 24, 2024
- Advertisement -

వైసీపీ నేత రెహమాన్ కన్నుమూత…

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా కాటుకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు బలి అవుతున్నారు. గత కొన్ని రోజులుగా కరోనాతో పలువురు రాజకీయ నేతలు చనిపోతున్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి మరణించిన విషయం తెలిసిందే.. ఇది మరువక ముందే సీనియర్ నేత, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెహమాన్ కన్నుమూశారు.

హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెహమాన్ ఈ మధ్యాహ్నం మృతి చెందడంతో పార్టీ వర్గాలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. రెహమాన్ గతంలో ఎమ్మెల్సీగానూ పనిచేశారు. వైసీపీ స్థాపన నాటి నుంచి జగన్ తోనే ఉన్న రెహమాన్ కు వైఎస్ ఫ్యామిలీతో ఎంతో సాన్నిహిత్యం ఉంది.

రెహమాన్ మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెహమాన్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎనలేని సేవలు అందించారని, ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. రెహమాన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్ కోసమే పరీక్షలు : సీఎం జగన్

ప్రైవేట్ ఆసుపత్రులకి టీకా పంపిణీ బంద్ టీ సర్కార్ సంచలన నిర్ణయం!

పది, ఇంటర్ పరీక్షలపై ఏపి ప్రభుత్వానికి హైకోర్టు కీలక సూచన

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -