Wednesday, May 1, 2024
- Advertisement -

నంద్యాలలో విషాదం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం మొత్తం ఆత్మహత్య

- Advertisement -

దేశంలో కరోనా కష్టకాలం అంతా ఇంతా కాదు. కరోనా నేపథ్యంలో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిపోతుంది. చేయడానికి సరైన పనులు లేక ఎంతో మంది ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నారు. కొంత మంది ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.

నడిగడ్డ సమీపంలోని మల్దార్‌పేటకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చుట్టు పక్కల వాళ్లు ఈ విషయాన్ని తెలుసుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

విగత జీవులుగా మారిన శేఖర్, కళావతి, పిల్లలను చూసి బంధువులు బోరున విలపించారు. నిన్న మొన్నటి వరకు తమతో సంతోషంగా మాట్లాడుతూ తిరిగిన ఆ కుటుంబం మొత్తం ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

థానేలో మరో ఘోరం.. ఆసుపత్రిలో అగ్నిప్రమాదం

దుమ్మురేపుతున్న ‘టక్ జగదీష్’ టీజర్..!

పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -