Saturday, April 27, 2024
- Advertisement -

BREAKING NEWS : నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత.. ముగ్గురు చొరబాటుదారులు వస్తుండగా..!

- Advertisement -

బలగాల కాల్పుల్లో ముగ్గురు చొరబాటుదారులు హతంజమ్ముకశ్మీర్​ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి చొరబాటుకు యత్నించిన ముగ్గురు ముష్కరులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటనలో నలుగురు భారత సైనికులకు గాయాలయ్యాయి.

అఖ్నూర్​ సెక్టార్​లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఖౌర్​ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడిందని భారత అధికారులు తెలిపారు. మోర్టార్​ షెల్స్​ విసిరి దాడులకు పాల్పడుతూ ఉగ్రవాదులను కశ్మీర్​లోకి చొరబడేలా చేసేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు.

ఈ క్రమంలోనే భద్రతా దళాలు ప్రతిఘటించి ముగ్గురు ముష్కురులను మట్టుబెట్టాయని పేర్కొన్నారు.మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలు పాక్ భూభాగంలో పడి ఉన్నాయని, పాక్​ సైన్యం ఆ మృతదేహాలను ఇంకా తీసుకెళ్లలేదని అధికారులు చెప్పారు. ఈ ఏడాది ​ జరిగిన కాల్పుల ఉల్లంఘన ఘటనల్లో ఇదే అతిపెద్దదని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -