అంబేడ్కర్కు సంబంధించిన స్థలాలు, ప్రాంతాలన్నింటిని పంచతీర్థాలుగా చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్లో అంబేడ్కర్ ఫోటో పెట్టించిన ఘనత కూడా బిజేపిదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బిజేపి రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీలు వివేక్, విజయశాంతి నివాళి అర్పించారు.
సీఎం కుర్చీ తన ఎడమ కాలి చెప్పుతో సమానమని… ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలన్నారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల పాలనకు చరమగీతం పాడాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో వెళ్లేందుకు సమయమున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అంబేడ్కర్కు నివాళి అర్పించే సమయం లేదా అని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 150 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
తమిళనాడులో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
IPL 2021 : క్షమాపణ కోరిన షారూఖ్ ఖాన్.. అందుకేనా?