Friday, March 29, 2024
- Advertisement -

పంచతీర్థాలుగా చేశామని బిజెపీ కొత్త మాట..

- Advertisement -

అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలు, ప్రాంతాలన్నింటిని పంచతీర్థాలుగా చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ ఫోటో పెట్టించిన ఘనత కూడా బిజేపిదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని బిజేపి రాష్ట్ర కార్యాలయంలో అంబేడ్కర్ 130వ జయంతి వేడుకలు నిర్వహించారు.

కార్యక్రమంలో కిషన్ రెడ్డితోపాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేడ్కర్​ చిత్రపటానికి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, మాజీ ఎంపీలు వివేక్‌, విజయశాంతి నివాళి అర్పించారు.

సీఎం కుర్చీ తన ఎడమ కాలి చెప్పుతో సమానమని… ముఖ్యమంత్రి కేసీఆర్​ రాజ్యాంగాన్ని అవమానించారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలన్నారు. కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల పాలనకు చరమగీతం పాడాలన్నారు.

ఎన్నికల ప్రచారంలో వెళ్లేందుకు సమయమున్న ముఖ్యమంత్రి కేసీఆర్​కు అంబేడ్కర్​కు నివాళి అర్పించే సమయం లేదా అని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆక్షేపించారు. రాష్ట్రంలో 150 అడుగుల అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి.. కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.

తమిళనాడులో ఘోరం.. 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..

IPL 2021 : క్షమాపణ కోరిన షారూఖ్ ఖాన్.. అందుకేనా?

కరోనా వచ్చిందని ప్రాణం తీసుకుంది.. ఎందుకంటే..!

ప్రపంచంలో ఎక్కడలేని అంత పెద్దది ఇక్కడే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -