Sunday, May 12, 2024
- Advertisement -

ప్రాణాలు కోల్పోయిన అభిమాని.?

- Advertisement -

ఆడియో ఫంక్షన్స్ అన్నాక ఎక్కువ మంది జనాలు రావడం సర్వ సాధారణం. ఇక అప్పుడప్పుడు జనాలు భారీగా వచ్చినప్పుడు తొక్కిశలాటలు జరుగుతూ ఉంటాయి. ఇక టాలీవుడ్ హీరో శర్వానంద్ తాజాగా “శ్రీకారం” సినిమాతో ముందుకు రాబోతున్నాడు.రెండు రోజుల క్రితం ఖమ్మంలో మమత మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌ జరిగిన సంగతి తెలిసిందే.

మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు జనాలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవిని చూడటానికి అభిమానులు అత్యుత్సాహం చూపడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో చాలా మందికి గాయాలు అయ్యాయి. ఇక శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఆ తరువాత వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించడం జరిగింది.రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ బుధవారం మరణించాడు.

ప్రకాష్‌ నగర్‌కు చెందిన శివ వంటమాస్టార్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.మరి ఈ ఘటనపై చిరంజీవి కానీ శర్వానంద్ కానీ ఎలా స్పందిస్తారో తెలియాల్సి వుంది.

దేత్తడి హారికా పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్?

మహేష్ తో మూడు సంవత్సరాలు సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్న రాజమౌళి!

రికార్డు రేటింగ్ సాధించిన షాదీ ముబారక్ సినిమా…!

సామాన్యుడిలా నిలబడి ఓటేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -